రాష్ట్రీయం

కార్మికులందరికీ ఈఎస్‌ఐ వర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని కార్మికులందరికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కార్మికుల సంక్షేమంపై ప్రగతిభవన్‌లో శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు బీమా అమలు చేయాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు? ఆరోగ్యం, సంక్షేమం, బీమా తదితర అంశాల్లో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలేమిటి? తీసుకోవాల్సిన చర్యలేమిటి? అన్న అంశాలపై నివేదికను రూపొందించి అందించాలని కేసీఆర్ సూచించారు. కార్మికులందరికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల పేర్లను కార్మిక శాఖలో రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. మేడే తర్వాత మరో పర్యాయం సమావేశం కావాలని నిర్ణయించారు. సమావేశంలో కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.