రాష్ట్రీయం

కాళీయమర్దనుడిగా లక్ష్మీనృసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 28: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానంలో స్వామి వారి జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యారాధనలు, మూలమంత్ర జపములు, చతుర్విద పారాయణములు జరిగాయి. అనంతరం స్వామి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. మంగళ నీరాజనం, మంత్ర పుష్ప కార్యక్రమాలు నిర్వహించిన తదుపరి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారిని కాళీయమర్థనం అలంకరణలో అత్యంత సుందరంగా పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో అలంకరించి అలంకార సేవను నిర్వహించారు. సాయంత్రం హవనం, మూలమంత్ర జపములు, మంత్ర పుష్పములు జరిపిన అనంతరం శ్రీ స్వామి వారిని రామావతరంలో అత్యంత సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై ఊరేగించారు. యాజ్ఞికులు ఫణీంద్రచార్యులు, రాఘవాచార్యులు, ప్రధాన అర్చకులు లక్ష్మీనర్సింహాచార్యులు, నర్సింహాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, దేవాలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ పర్యవేక్షకులు రఘు తదితరులు పాల్గొన్నారు.