రాష్ట్రీయం

నేత్రానందంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 29: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి జయంత్యుత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉద యం బాలాలయంలోని యజ్ఞశాలలో శ్రీ నారసింహ హోమం నిర్వహించారు. మూ ల మంత్ర జపములు, పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసిన అనంతరం శ్రీ స్వామి, అమ్మవార్లకు సహస్త్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని వేద పండితులు, అర్చకులు, యాజ్ఞికులు వేద మంత్రాలతో, సన్నాయి మేళాలతో నిర్వహించారు. పంచామృతాలు, పవిత్ర నైవేద్యాలతో శ్రీ స్వామి, అమ్మవార్లకు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వెయ్యి కలశాభిషేకాలను అత్యంత వైభవంగా జరిపారు. సాయంత్రం కల్యాణ మండపంలో శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంతి, తిరువారాధన, సేవాకా లం, చతుర్వేద పారాయణములను వైష్ణవ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. అనంతరం లక్ష్మీనృసింహ స్వామి ఆవిర్భావ ప్రవచనం చేశారు. రాత్రి మంగళ నీరాజనం, పండిత సన్మానంతో మూడు రోజుల పాటు జరుగుతున్న శ్రీ లక్ష్మీనృసింహుడి జయంత్యుత్సవాలు ముగిశాయి. రేపటి నుంచి భక్తులు నిర్వహించే సహస్త్ర నామార్చనలు, ఆర్జిత సేవలు, కల్యాణాలు, వివిధ పూజలు నిర్వహిస్తారని దేవస్థాన అధికారులు తెలిపారు.

చిత్రం..బాలాలయంలో వెయ్యి కలశాభిషేకాలు నిర్వహిస్తున్న దృశ్యం