రాష్ట్రీయం

ప్రజల్ని వంచించి ధర్మపోరాటం చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 30: వెంకన్న సాక్షిగా తెలుగు ప్రజలను వంచించిన మీరే బీజేపీపై నెపం వేస్తూ ధర్మపోరాటం పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ ఆధ్వర్యంలో విశాఖలో సోమవారం జరిగిన ‘వంచన వ్యతిరేక దీక్ష’లో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా పదేళ్లన్న బీజేపీ, కాదు పదిహేనేళ్లు ఇవ్వాలన్న టీడీపీ, చివరకు ప్యాకేజీకి ప్రజలను మానసికంగా సిద్ధం చేయలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు 29సార్లు ఢిల్లీ వెళ్లి సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఏనాడైనా ప్రధాని మోదీని హోదా ఇవ్వాలని నిలదీశారా ? ఇప్పుడు హోదా ఇవ్వలేదంటూ విమర్శిస్తున్నారన్నారు. ఇది చంద్రబాబు నయవంచనకు నిదర్శనమని విమర్శించారు. గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నది జగన్ సారధ్యంలోని వైసీపీ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎక్కువ అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని అన్నారు. 29సార్లు ఢిల్లీ వెళ్లి వట్టి చేతులతో తిరిగి వచ్చిన సీఎం కూడా చంద్రబాబేనని అన్నారు. కేంద్రంలో కొనసాగుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడం వలన గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రం లక్షా 30వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఈ 70 ఏళ్లలో 90 వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తే, ఈ నాలుగేళ్లలోనే లక్ష కోట్లకు పైగా అప్పులు చేయాల్సి వచ్చిందని అన్నారు.