రాష్ట్రీయం

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జూన్ 2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ఉదయం అర్చనలు, అష్టోత్తరాలు, నిత్య కల్యాణోత్సవాలు, వెండి జోడి సేవలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. స్వామి వారి దర్శనాలు, వివిధ పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో కొండ కిటకిటలాడింది. దేవస్థానం ఒక్కరోజు ఆదాయం రూ.16లక్షల 41,941 సమకూరింది. వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతులు నిర్వహించారు. పంచామృతాభిషేకం జరిపి తులసీ దళాలతో అర్చించి సుందరంగా అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణోత్సవాన్ని పంచారాత్ర ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. అంతకుముందు ఆలయం లో యాజ్ఞికులు వేద మంత్ర పఠనాల మధ్య శ్రీ సుదర్శన నారసింహ హోమం జరిపారు. శనివారం కావడంతో కొండపైన సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు పెద్ద సంఖ్యలో నిర్వహించుకున్నారు.

చిత్రం..యాదాద్రిలో శనివారం స్వామివారి కల్యాణోత్సవం