రాష్ట్రీయం

రాయలసీమకు నైరుతి పవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 4: నైరుతి రుతుపవనాలు సోమవారం రాయలసీమను తాకాయి. నిర్ణీత సమయం కన్నా, రెండు, మూడు రోజులు ముందే రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలియచేశారు. ఈ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయని, 7 నుంచి 9లోగా ఉత్తర కోస్తాలో ప్రవేశిస్తాయని తెలియచేశారు. రుతుపవనాల ప్రభావం వలన రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో కూడా చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.