రాష్ట్రీయం

సెల్‌ఫోన్ లోడ్ లారీ మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల, జూలై 19: ఏడున్నర కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన సెల్‌ఫోన్లు, సెల్‌ఫోన్ పరికరాలతో ఉన్న లారీ మాయమైన సంఘటన ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. చెన్నై రాష్ట్రం వెల్లూరు జిల్లాకు చెందిన కే.రంగనాథ్ తన సొంత లారీని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రంగనాధ్ 18వ తేదీన చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ నుంచి ఏడున్నర కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే రెడ్‌మీ ఫోన్ కంపెనీ పరికరాలు కలకత్తాకు చేరవేసేందుకు బాడుగకు మాట్లాడుకుని బయలుదేరారు. బుధవారం రాత్రి పదిగంటల సమయంలో మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన ఉన్న బీహార్ హోటల్ వద్ద లారీని పార్కింగ్ చేసుకుని మేదరమెట్ల గ్రామంలోకి వెళ్లాడు. గంటకుపైగా గ్రామంలో గడిపిన రంగనాథ్ హోటల్ వద్దకు వచ్చి చూడగా సెల్‌ఫోన్ లోడుతో ఉన్న లారీ మాయమైనట్లు గమనించాడు. కొంతసేపు పరిసర ప్రాంతాల్లో లారీ కోసం వెతికిన రంగనాధ్ గురువారం తెల్లవారు జామున మేదరమెట్ల పోలీసులను ఆశ్రయించాడు. రంగనాథ్ ఫిర్యాదు మేరకు మేదరమెట్ల ఎస్సై వై.పాండురంగారావు కేసు నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సినీ ఫక్కీలో సరుకుతో సహా లారీ మాయం కావడం మేదరమెట్ల గ్రామంలోనే కాకుండా పరిసర గ్రామాల్లో కూడా సంచలనాన్ని రేకెత్తించింది.