రాష్ట్రీయం
శ్రీవారి ఆలయం మూసివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 July 2018
తిరుపతి, జూలై 27: చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. శుక్రవారం రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై శనివారం తెల్లవారు జామున 3.49 గంటలకు ముగుస్తుంది. గ్రహణం సందర్భంగా సాయంత్రం ఆలయాన్ని మూసివేసిన టీటీడీ అధికారులు శనివారం ఉ. 4.15 గంటలకు సుప్రభాత సేవ, నిత్యార్చన, శుద్ధి కార్యక్రమాల అనంతరం ఆలయ మహాద్వారం తలుపులు తెరుస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్, ఇన్చార్జి సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, టెంపుల్ డిప్యూటి ఈఓ హరీంద్రనాథ్, ఆలయ పేష్కార్ రమేష్, విజీఓ రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.