రాష్ట్రీయం

మంత్రాలయం వద్ద తుంగభద్రలో మొసళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూలై 27: కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో మూడు మొసళ్లు కనిపించాయి. నాలుగు రోజుల క్రితం నది మధ్యలో రాయిపై ఓ మొసలి కనిపించింది.
తాజాగా గురువారం రాత్రి శ్రీ మఠానికి చెందిన హెచ్‌ఆర్బీ కల్యాణ మండపం వెనుక భాగాన ప్రవహిస్తున్న తుంగభద్ర నది ఒడ్డున మూడు మొసళ్లు కనిపించాయి. తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేసినందున ఆ నీళ్లలో మొసళ్లు కొట్టుకుని వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో మొసళ్లు ఉన్నందున భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.