రాష్ట్రీయం

కళాశాల విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: మరో బృహత్తర పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో దేశం మొత్తంలో శభాష్ అనిపించుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపచేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్, మోడల్ జూనియర్ కాలేజీలు, బీఈడీ, డీఈడీ కాలేజీల్లో చదువుతున్న సుమారు ఐదు లక్షల మందికి అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి శనివారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలోని కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజేన పథకం అత్యంత నాణ్యంగా, పౌష్టిక విలువలతో అందించేందుకు మూడు రకాల ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులను కమిటీ అడిగింది. ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కావల్సిన సరకులన్నీ అందిస్తే సరఫరా చేయడం, సరకులు అన్నీ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారానే సమకూర్చుకుని భోజనం
అందించడం, పులిహోరా, బ్లాక్ రైస్, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జల వంటి విభిన్న తృణ ధాన్యాలతో కూడిన భోజనాన్ని అందించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని కోరింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో అన్ని కాలేజీలకు మధ్యాహ్న సమయానికి భోజనం అందే విధంగా కావల్సిన వంట గదులు ఏర్పాటు చేసుకోవాలని, వౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రులు అక్షయపాత్ర ఫౌండేషన్‌కు సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌తో పాటు కాలేజీలకు దగ్గరగా ఉన్న మెస్సులు, హోటళ్ల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించడంపై కూడా చర్చించి, ఈ వివరాలను పూర్తిస్థాయిలో తెప్పించుకుని వచ్చే సమావేశంలో కూలంకషంగా చర్చించాలని నిర్ణయించారు. ఆగస్టు మూడో తేదీన సచివాలయంలో ఈ కమిటీ సమావేశం కావాలని, ఈ సమావేశానికి అక్షయపాత్ర ఫౌండేషన్ తగిన ప్రతిపాదనలతో రావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ జాయిండ్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి