రాష్ట్రీయం

కేంద్రం మోసం బట్టబయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 29: తాజాగా కేంద్ర హోం శాఖ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టి వారంరోజులు గడవక ముందే మోదీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. నిన్నటిదాకా రైల్వేజోన్ అంశం పరిశీలిస్తున్నామని, నేడు సాధ్యం కాదని అఫిడవిట్ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాజా అఫిడవిట్‌పై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు కేంద్రాన్ని వదిలేది లేదన్నారు. జనసేన నేత పవన్‌కళ్యాణ్‌కి అసలు రైతులంటే తెలుసా? అని ప్రశ్నించారు. నాలుగు రోజులు రోడ్లపై తిరిగి 40రోజులు హైదరాబాద్‌లో ఉండేవాడు నాయకుడెలా అవుతాడని నాని ఎద్దేవా చేశారు. రైతులకు న్యాయం చేస్తున్న చంద్రబాబుపై పవన్ పోరాటం చేయడం కంటే ఏపీ హక్కుల సాధన కోసం మోదీపై పోరాటం చేయడం మంచిదన్నారు.