రాష్ట్రీయం
తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి టీటీడీ సారె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 August 2018
తిరుపతి, ఆగస్టు 5: తిరుత్తణి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ ఆదివారం సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆడికృత్తికను పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామివారికి టీటీడీ పట్టువస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తోంది. టీటీడీ అధికారులకు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ చైర్మన్ వి.జయశంకర్, ఆలయ ఈఓ శివాజీ, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికి పట్టువస్త్రాలను స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.