రాష్ట్రీయం

నక్షత్ర తాబేళ్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 5: ఇతర రాష్ట్రాల నుంచి నక్షత్ర తాబేళ్ళను విశాఖ మీదుగా విదేశాలకు తరలిస్తున్న నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 1,125 నక్షత్ర తాబేళ్ళను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులకు అందిన సమాచారం మేరకు విశాఖ రైల్వే స్టేషన్‌లో కాపుకాసి గుట్టును రట్టు చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్-7 బోగీలో నక్షత్ర తాబేళ్లను ముగ్గురు వ్యక్తులు తరలిస్తుండగా, దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, తాబేళ్లను అటవీ అధికారుల ద్వారా జంతు ప్రదర్శన శాలకు తరలించారు.

చిత్రం..స్వాధీనం చేసుకున్న నక్షత్ర తాబేళ్లు