రాష్ట్రీయం

నవంబర్ 4న టాలెంట్ సెర్చి ఎగ్జామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చి ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) తొలి దశ పరీక్షను నవంబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు ఆగస్టు 29వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుడి కార్యాలయం వెబ్‌సైట్ ద్వారా ఆహ్వానిస్తున్నట్టు పరీక్షల
బోర్డు డైరెక్టర్ బి సుధాకర్ తెలిపారు. ప్రతి విద్యార్థి వంద రూపాయిలు చొప్పున చలానా రూపంలో చెల్లించాలని అన్నారు. డిమాండ్ డ్రాఫ్ట్‌లను అంగీకరించేది లేదని చెప్పారు. ఇతర వివరాలకు పరీక్షల బోర్డు వెబ్ పోర్టల్ సందర్శించాలని లేదా 9701678767, 9052003330, 9247834799 నెంబర్లకు ఫోన్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు.