రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో పవిత్రాల సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 22: తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం 9గంటలకు సంపంగి ప్రాకారంలో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం పవిత్రాలను వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులక, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, ఆనంద నిలయ విమానానికి, ధ్వజస్తంభానికి, శ్రీ భూవరాహ స్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి పవిత్రమాలల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సల్లింపు నిర్వహించారు. రాత్రి 9నుంచి 11గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ రమేష్‌బాబు అధికారులు పాల్గొన్నారు. గురువారం రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.