రాష్ట్రీయం

అందరినీ ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, ఆగస్టు 23: తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని వైకాపా అధినేత జగన్ హామీ ఇచ్చారు. రైతాంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పంటలు పండిస్తోందని అయినా కష్టాల నుంచి గట్టెక్కడం లేదంటూ అవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీకి పట్టం కడితే అన్నదాతను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. గురువారం 243వ రోజు ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నం జిల్లా, యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చేరుకున్న సందర్భంగా జగన్ మాట్లాడారు. ఏటికొప్పాక జాతీయ గుర్తింపు పొందిన లక్కబొమ్మల పరిశ్రమ కార్మికులు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వం హామీలు నేరవేర్చలేదని, ముడుసరుకు కొరత, ఉచిత విద్యుత్, 45 ఏళ్ళకే పింఛన్ వంటి సమస్యలను వివరించారు. వీటిపై మైరుగైన అవకాశాలను కల్పించి అదుకుంటానని జగన్ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

చిత్రం..ప్రజాసంకల్పయాత్రలో జగన్‌కు సమస్యలు చెబుతున్న రైతులు