రాష్ట్రీయం

ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 23: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం పూర్ణాహుతితో ఘనంగా ముగిసాయి. తొలి రెండురోజుల్లాగానే గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. పంచామృతాలతో అభిషేకించి చివరిగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. సాయంత్రం శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామి వారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తరువాత శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవీతో విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిసినట్టయింది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా పవిత్రోత్సవాల నేపథ్యంలో గురువారం తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.