రాష్ట్రీయం

డిసెంబర్‌లో ఎన్నికలొస్తాయేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు హడావుడి చూస్తుంటే ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చేలా ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీ భవన్ నుంచి జిల్లాల్లోని 20 వేల పోలింగ్ కేంద్రాల కమిటీ సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన అనేక సందేహాలకు, అనుమానాలకు, ముందస్తు ఎన్నికల ఊహగానాలకు ఉత్తమ్ సమాధానాలిచ్చారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించడాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. పార్టీకి పోలింగ్ కేంద్రం కమిటీలు అత్యంత కీలకమైనవని ఉత్తమ్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో పని చేసే కార్యకర్తలతోనే పార్టీకి గట్టి పునాదులు పడతాయని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో పని చేసే కార్యకర్తలు, నాయకులతోనే కాంగ్రెస్ బలోపేతం అవుతుందని, వారికి తగిన గుర్తింపునిస్తామని ఆయన తెలిపారు.