రాష్ట్రీయం

ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
కమిషనర్ బీ. జనార్ధన రెడ్డిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌గా బదిలీ చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజీ బోర్డు ఎండీ ఎం. దాన కిశోర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పంపింది. కిశోర్ ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి ఆ బాధ్యతలను కూడా కొనసాగిస్తారని ప్రభుత్వం పేర్కొంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న టీ. చిరంజీవులును స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇనస్పెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. హైదరాబాద్‌కు ఉత్తమ కార్పొరేషన్‌గా వచ్చిన అవార్డును తీసుకునేందుకు ఆయన ముంబై వెళ్లారు. స్వచ్ఛ భారత్ ప్రచారంలో ఆయన చేసిన కృషికి టైమ్స్ బెస్టు కమిషనర్ అవార్డును ఆయన స్వీకరించనున్నారు.