రాష్ట్రీయం

విశాఖలో ముగిసిన జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విశాఖలో తెరపడింది. ఇప్పటి వరకూ 268 రోజులుగా సాగుతున్న పాదయాత్ర ఆదివారం సాయంత్రం ఆనందపురం మండలం సరిపల్లి కాలనీలో 2999.1 కిమీ వద్ద ముగిసింది. ఆదివారం ఉదయం గండిగుండం జంక్షన్ వద్ద పాదయాత్ర ప్రా రంభమైంది. అక్కడ నుంచి అక్కిరెడ్డిపాలెం, జుత్తాడ జంక్షన్‌ల మీదుగా రాజయ్యపేట, రాయవరపువానిపాలెం, సరిపల్లి కాలనీల్లో పాదయాత్ర కొనసాగింది. సరిపల్లి కాలనీ వద్ద పాదయాత్ర ము గిసింది. అక్కడ నుంచి చింతలపాలెం వద్ద విజయనగరం జిల్లాలో ప్రవేశించింది. ఆదివారం నాటి పాదయాత్రలో రాజశేఖర్ అనే వ్యక్తి జగన్‌ను కలిసి ఐటీ రంగంలో స్టార్టప్‌లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రభుత్వం చేస్తున్న ప్రకటన మేడిపండు చందమేనని వివరించారు. అనంతరం మంగళగిరి ప్రాంతానికి చెందిన పలువురు చేనేత కార్మికులు జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఇతర పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు వైసీపీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

చిత్రం.. వైసీపీ అధినేత జగన్