రాష్ట్రీయం

టీడీపీకి చరమగీతం పాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి (రూరల్), అక్టోబర్ 17: టీడీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఆ పాలనకు చరమగీతం పలకాలని ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అధికారంకోసం ఏ పార్టీతోనైనా పొత్తుపెట్టుకునేందుకు సిగ్గుపడని చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పసుపు కుంకుమ పేరుతో మహిళలు అన్ని విధాలా వేధింపులకు గురవుతున్నారన్నారు. వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు ప్రకటనలే తప్ప మహిళలకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు పిల్లల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స ఝాన్సీలక్ష్మి, నియోజకవర్గ కన్వీనర్ శంబంగి వెంకటచినప్పలనాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.