రాష్ట్రీయం

హోదా ఇచ్చేవరకూ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రధాన నరేంద్రమోదీ నేతృత్వంలోని ఏన్డీయే ప్రభుత్వం విభజన హామీలు అమలు చేసి, ఏపీకి న్యాయం చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ ఎంపీలు హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు నిరసన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను శీతకాల సమావేశాల్లోనైనా అమలు చేయాలని ఎంపీలు కోరారు. కేంద్రం విభజన హామీలపై స్పందించే వరకూ పోరాటం కొనసాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు విషయంలో మోదీ ఏపీకి అన్యాయం చేశారని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆరోపించారు. నిత్యం కొత్త వేషధారణతో నిరసన తెలిపే శివప్రసాద్ శుక్రవారం తమిళనాడు మాజీ సీఎం, దివంగత డీఎంకే చీఫ్ కరుణానిధి వేషంతో ఆకట్టుకున్నారు. మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.