రాష్ట్రీయం

వెంకన్న ఆశీస్సులతోనే విజయం సాధించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, డిసెంబర్ 17: వెంకన్న ఆశీస్సులతోనే ఎన్నికల్లో విజయం సాధించామని, మొక్కు తీర్చుకునేందుకే వచ్చామని తెలంగాణ మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో పాటు ఎమ్మెల్యేగా ఆరోసారి విజయం సాధించిన టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు, వారి కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ సతీమణి, వారి కుటుంబ సభ్యులు రేణిగుంట విమానాశ్రయంకు మధ్యాహ్నం 3గంటలకు చేరుకున్నారు. వీరికి అభిమానులు పుష్పగుచ్చాలిచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. ప్రజల అభిమానమే తమను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చిందన్నారు. తిరుమల శ్రీవారి మొక్కు తీర్చి ఆయన ఆశీస్సులు పొందేందుకు వచ్చామని అన్నారు. ఏపీలో జరగనున్న ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తారా.. అన్న ప్రశ్నకు ఈ సమయం లో రాజకీయాలు మాట్లాడబోనన్నారు. అనంతరం రోడ్డుమార్గాన తిరుమలకు వెళ్లారు.