రాష్ట్రీయం

పెథాయ్‌తో గజగజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 17: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారీ నష్టాన్ని చేకూర్చింది. 24 గంటలుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షానికి వరి పంట తీవ్రమైన నష్టం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.60 లక్షల హెక్టార్ల వరి వేయగా అధిక శాతం రైతుల పంట కల్లాలకు చేరింది. ఒక్కసారిగా వచ్చిన వర్షంతో ధాన్యం తడవడంతో ఆందోళన చెందుతున్నారు. అనేకచోట్ల మిర్చి కల్లాల్లో కూడా నీరు వచ్చి చేరడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి ధాన్యం తడిసిపోవడమే కాకుండా నీటిలో కొట్టుకుపోతుండటంతో కష్టించి పండించిన పంట కళ్ళ ముందే తడిచిపోతుంటే రోదించిన రైతులు కూడా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు సొసైటీలు, ఐకెపి కేంద్రాల ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ముందుగా ప్రత్యేక వాహనాలతో తరలించడంతో ఇబ్బందులు తప్పాయి. ఏజన్సీ ప్రాంతంలోని రైతులు తమ పంటను కాపాడుకునేందుకు అవసరమైన సామాగ్రి లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.

చిత్రం..కళ్లాల్లో ధాన్యంపై పట్టాలు కప్పిన దృశ్యం