రాష్ట్రీయం

ఆలయంలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 2: అర్చకుడు, అతని భార్యను శనివారం అత్యంత దారుణంగా హత్యచేసిన సంఘటన నెల్లూరు శివారు చెరుకూరు గ్రామంలో శివాలయంలో జరిగింది. పోలీసులు, స్థానిక కథనం మేరకు నెల్లూరు మండల పరిధిలోని పెద్దచెరుకూరు గ్రామంలోని శివాలయంలో ప్రథమ అర్చకులుగా పనిచేస్తున్న నూతలపాటి చంద్రవౌళేశ్వరరావు (65), ఆయన భార్య పుష్పవేణి (60) వృద్ధ దంపతులను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణమైన స్థితిలో హత్య చేశారు. హతుడు చంద్రవౌళీశ్వరరావు ఆయన భార్య పుష్పవేణి స్థానిక శివాలయం ప్రాంగణంలోని గదిలో నివాసం ఉంటున్నారు. చంద్రవౌళి కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయన కుమారుడు సుబ్బయ్యశాస్ర్తీ పక్క గ్రామమైన అల్లీపురంలో నివాసం ఉంటూ రోజూ శివాలయానికి అర్చన చేసి పోతుండేవాడు. శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి, వృద్ధ దంపతులు రక్తపుమడుగులో పడి ఉండటం చూసి కేకలు వేసి చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. ఇది తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా హత్యాస్థలంలో ఎస్‌పి విశాల్ గున్నీ విలేఖరులతో మాట్లాడుతూ అగంతకులు అత్యంత పదునైన మారణాయుధాలను వాడినట్లు తెలుస్తోందన్నారు. నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాన్ని నియమించినట్టు చెప్పారు.

చిత్రం హత్యకు గురయిన పూజారి దంపతులు