రాష్ట్రీయం

పోలవరం గడువు పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువు పొడిగించేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఇప్పటికే గుర్తించి కొంతమేరకు నిధులు కేటాయిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును సమీక్షించేందుకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి శనివారం విలేఖరులకు తెలిపారు. ఆయనతో సమీక్ష జరిపిన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును పెంచే ప్రతిపాదనకు తుదిరూపం ఇస్తామని ఆమె చెప్పారు. నిర్ణీత గడువులోగా దీన్ని పూర్తి చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 500 కోట్ల రూపాయలు ఇచ్చిందని, మరో 1,600 కోట్లు కేటాయించాలని కోరుతూ ‘నీతి ఆయోగ్’కు లేఖ రాసినట్లు ఉమాభారతి వివరించారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు తీరు అసంతృప్తికరంగానే ఉందని ఆమె అంగీకరించారు. ఇకపై నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. పనుల తీరు చూస్తుంటే ప్రాజెక్టు నిర్మాణం గడువును పెంచకతప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలా గడువు పెంచడం వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేకున్నా, అనివార్య కారణాల వల్ల ‘డెడ్‌లైన్’ను కొంతమేరకైనా పెంచక తప్పదన్నారు.
‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ’ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా పనుల బాధ్యతను ఎపి ప్రభుత్వం చూస్తోంది గనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చినపుడు అన్ని విషయాలను స్వయంగా తెలుసుకుంటానని ఆమె చెప్పారు. ఇది ఎపికే కాదు, దేశానికి సంబంధించిన బృహత్తర సాగునీటి ప్రాజెక్టు అని ఆమె అభివర్ణించారు. ఎపి ప్రభుత్వానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ‘సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిందని, నదుల అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసిన ఎపి ప్రభుత్వానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు?’ అని విలేఖరులు ప్రశ్నించగా- ఆ ప్రాజెక్టు ప్రోత్సాహకాల పరిధిలోకి రాదని ఉమాభారతి బదులిచ్చారు. ‘ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం’కు సంబంధించిన సాగునీటి పథకాలను సకాలంలో పూర్తిచేస్తేనే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు 2018లోగా పూర్తి కావల్సి ఉందని, అయితే ఎంతమేరకు గడువు ఇస్తామన్న విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేనని ఉమాభారతి అన్నారు.

చిత్రం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న ఉమాభారతి