రాష్ట్రీయం

28న వైకాపాలోకి కిల్లి కృపారాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఈ నెల 28న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంగళవారం లోటస్ పాండ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళిన కిల్లి కృపారాణి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. వైఎస్ జగన్ మాట తప్పరు, మడమ తిప్పరని అన్నారు. కాంగ్రెస్-టీడీపీ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశానని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను వాడుకుని వదిలి వేశారని విమర్శించారు. టిక్కెట్ ఆశించి తాను జగన్‌ను కలవలేదని, బేషరతుగా పార్టీలో చేరనున్నానని ఆమె తెలిపారు.

చిత్రం.. హైదరాబాద్‌లో మంగళవారం వైఎస్ జగన్‌ను కలిసిన కిల్లి కృపారాణి