రాష్ట్రీయం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వివిధ జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం మాజీ ఎమ్మెల్యే బాబ్జీ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇంకా నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ దొంతు శారద, ఆమె భర్త బాలకృష్ణ కూడా వైకాపాలో చేరారు. బుధవారం టీడీపీ మాజీ ఎంపీ తోట నరసింహం కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
నేడు తొలి జాబితా..
ఇలాఉండగా అసెంబ్లీ ఎన్నికలకు బుధవారం తొలి జాబితా ప్రకటించాలని జగన్ భావిస్తున్నారు. మొత్తం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ రోజూ 25 మంది చొప్పున విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.