రాష్ట్రీయం

9మందితో వైకాపా తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. మంచి మూహుర్తం అని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర చెప్పడంతో తొలి జాబితాను విడుదల చేస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మిగతా పేర్లను ఆదివారం ఇడుపులపాయలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారని చెప్పారు.
1) కడప: అవినాష్ రెడ్డి, 2) అరకు: మాధవి గొట్టేటి, 3) బాపట్ల; నందిగామ సురేష్,
4) అమలాపురం: చింతా అనూరాధ, 5) కర్నూలు: డాక్టర్ సంజీవ్ కుమార్
6) రాజంపేట: మిథున్ రెడ్డి, 7) చిత్తూరు: రెడ్డప్ప, 8) అనంతపురం: తలారి రంగయ్య
9) హిందూపురం: గోరంట్ల మాధవ్.