రాష్ట్రీయం

ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే దివంగత నేత రాజీవ్ గాంధీ హయాంలో అమల్లోకి వచ్చిన పార్టీ ఫిరాయింపులచట్టం నవ్వుల పాలైనట్టు అవగతమవుతోంది. ప్రస్తుతం ఏ క్షణాన ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే అధికార పక్షంలోకి జంప్ చేస్తాడో, అధికార ఎమ్మెల్యే విపక్షం వైపు దూకుతాడో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. ఫిరాయింపుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఎవరు ఎటు పయనిస్తున్నారో, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. 175 శాసనసభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైకాపా మినహా మరోపార్టీకి గత ఎన్నికల్లో అవకాశం లేకుండాపోయింది. వైకాపా తరఫున 64 మంది గెలుపొందితే 21 మంది ఒకరి వెంట ఒకరుగా తెలుగుదేశంలో చేరిపోయారు. వీరిలో ఇద్దరు మళ్లీ వెనక్కి వచ్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్కరికీ వర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. చట్టాలు పక్కనపెడితే ఇక్కడ నైతిక విలువలకు కూడా స్థానం లేకుండా పోతోంది.
స్వాతంత్య్రానంతరం నుంచీ దేశంలో అభ్యర్థుల వ్యక్తిత్వం, గుణగణాలను బట్టి కాకుండా కేవలం పార్టీ గుర్తుల ఆధారంగా సామాన్యులు సైతం చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. అలాంటిది ప్రజాతీర్పును గౌరవించకపోవటం చూస్తే రాజకీయాలంటేనే ముఖ్యంగా యువతరంలో ఏవగింపు కలుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే 1978-82 నాటి పరిస్థితి పునరావృతవౌతోంది. నాటి ప్రజాప్రతినిధులు కూడా నైతిక విలువలకు కట్టుబడి పనిచేసిన దాఖలాలు కానరావు. 294 శాసనసభ స్థానాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనతా పార్టీ తరపున 60మంది గెలుపొందారు. ఉత్తరాంధ్ర నుంచి గౌతు లచ్చన్న, పీ అశోకగజపతిరాజు, ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి వంటి ప్రముఖులతో పాటు మొత్తం 16 మంది, ఉభయగోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాధంతో పాటు ఆరుగురు, కృష్ణా జిల్లాలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, వడ్డి రంగారావు, బూరగడ్డ నిరంజనరావు, మ్కొపాటి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లాలో దొడ్డపనేని ఇందిర, గుణపా రామస్వామిరెడ్డి, జీవీ రత్తయ్య, ఈపూరి సుబ్బారావు, ప్రకాశం జిల్లాలో జాగర్లమూడి చంద్రవౌళి, పిడతల రంగారావు, నెల్లూరులో వెంకయ్య నాయుడు, ఇక రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి, ఇ అయ్యపురెడ్డి వంటి ప్రముఖులు సహా మొత్తం 12మంది జనతా పార్టీ తరఫున గెలుపొందారు. తొలుత జనతా పార్టీలో చీలిక ఏర్పడి లోక్‌దళ్ ఆవిర్భవించగా శోభనాద్రీశ్వరరావు, అశోక్‌గజపతిరాజు, లచ్చన్న, భమిడి నారాయణ, ఈపూరి సుబ్బారావు, మొక్కపాటి ఆ పార్టీలో చేరారు. 1980 ప్రాంతంలో బీజేపీ ఏర్పడినప్పుడు ఎవ్‌వీఎస్ రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ పార్టీలో చేరారు. ముద్రగడ, కేఈ, రంగారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అయితే వీరెవరూ కూడా నైతిక విలువలతో తమ పదవులకు రాజీనామాలు చేసి తిరిగి ప్రజాతీర్పును కోరినవారు లేరు. ఇక రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, మరికొందరు ఇందిరా కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఆ పార్టీ విలీనం కావటంతో రాజీనామాలు చేయలేదని భావించవచ్చు. ఇక 1991లో ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోటానికి తెలుగుదేశం తరపున గెలిచిన 13 మందిలో ఆరుగురిని తనవైపు తిప్పుకున్నారు. అప్పటికి ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ మూడోవంతు మంది ఫిరాయించటంతో ఆ చట్టం వర్తించలేదు. ఇక రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది 2009-14 మధ్యకాలం. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనా రాజీనామాల ప్రస్తావన లేదు. అయితే ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల నుంచి 16మంది వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరగా ఆ పార్టీ నేత దమ్మూధైర్యంతో వారందరితో రాజీనామా చేయించడంతో 2012 ఫిబ్రవరి 16న ఉప ఎన్నికలు జరిగాయి. 14 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొందగా రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, నరసాపురంలో ఎం ప్రసాదరాజు మాత్రం ఓటమి పాలయ్యారు. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల తర్వాత రాజీనామా అనే మాటే వినపడకుండాపోయింది.
ఇదిలావుంటే 1994లో తెలుగుదేశం తరఫున గెలిచిన వారు అనేక మంది మధ్యలో ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి వెళ్లారు. మళ్లీ అనేక మంది తిరిగి తెలుగుదేశంలో చేరారు. ఆ ఐదేళ్ల కాలంలోనూ పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగినప్పటికీ రాజీనామాల మాట వినపడలేదు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచిన వారంతా మరో ఐదేళ్లు తెలుగుదేశంలో కొనసాగుతారా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. గత ఎన్నికల్లో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ లభించినా వైకాపా నుంచి ఫిరాయింపులు జోరుగా సాగాయి. అలాంటిది ఈదఫా ఒకవేళ ‘హంగ్’ ఏర్పడితే పరిస్థితి ఏమిటో రాజకీయ పరిశీలకుల ఊహకే అందటం లేదు.