రాష్ట్రీయం

ఎస్పీవైరెడ్డి కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల: నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం పరామర్శించారు. ఎస్పీవైరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన పవన్ కల్యాణ్ శనివారం నంద్యాల చేరుకుని ఎస్పీవైరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎస్పీవైరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత ఎస్పీవైరెడ్డి సతీమణి పార్వతమ్మ, ఆయన అల్లుడు సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి, కుమార్తెలు సుజల, అరవింద రాణితో మాట్లాడారు. ఎస్పీవైరెడ్డి మృతికి విచారం వక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పవన్ వెంట జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్ తదితరులు ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీవైరెడ్డి జనసేన తరఫున నంద్యాల లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఇద్దరు కూతుళ్లు, అల్లుడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఎస్పీవైరెడ్డి అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు.

చిత్రం... ఎస్పీవైరెడ్డి సతీమణి పార్వతమ్మను పరామర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్