రాష్ట్రీయం

భార్య గొంతు కోసిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ రాజేంద్రనగర్, ఏప్రిల్ 11: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసి పరారయ్యాడు. దీంతో కోర్టు ప్రాంగణంలో వున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. బాధితురాలిని స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోని లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన నాగేందర్‌బాబు, సౌజన్య దంపతులు వ్యక్తిగత కారణాలతో ఏడాదిన్నర క్రితం విడాకుల కోసం రాజేంద్రనగర్ కోర్టును ఆశ్రయించారు. వీరిద్దరికి పదేళ్ల క్రితం వివాహం కాగా ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో నాగేందర్ బాబు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదంటూ సౌజన్య కోర్టును ఆశ్రయించింది. తన పోషణ ఖర్చులు చెల్లించేలా భర్తను ఆదేశించాలని కోర్టును కోరింది. దీనిపై సోమవారం కోర్టులో విచారణ ఉండగా వీరిద్దరూ రాజేంద్రనగర్ న్యాయస్థానానికి వచ్చారు. కోర్టులో విచారణ పూర్తయ్యాక బయటకు వస్తున్న సమయంలో నాగేందర్‌బాబు తన వెంట తెచ్చుకున్న కత్తితో సౌజన్య గొంతు కోసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

చిత్రం భర్త దాడిలో గాయపడిన సౌజన్య