రాష్ట్రీయం
ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు రూ. కోటి విరాళం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తిరుపతి, జూలై 13: హైదరాబాద్కు చెందిన మంతెన శ్రీనివాసరాజు, శారద దంపతులు శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టుకు ఒక కోటి రూపాయలను విరాళంగా అందించారు. శనివారం విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల ప్రత్యేకాధికారి ఏ.వి.్ధర్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇదిలావుండగా అపకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వై.వెంకట సతీష్ రెడ్డి దంపతులు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ.10లక్షలు విరాళం అందిచారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీని వారు అందజేశారు.
చిత్రం... తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్కు కోటిరూపాయల విరాళం అందిస్తున్న హైదరాబాద్కు చెందిన మంతెన శ్రీనివాసరాజు దంపతులు