రాష్ట్రీయం

24న కేసీఆర్, జగన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలుగు రాష్ట్రాల ఇరువురు ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 24న మరోమారు హైదరాబాద్‌లో భేటీ కాబోతున్నట్టు సమాచారం. నదుల అనుసంధానంపై ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ అందజేసిన ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ఇది వరకే వీరు ఇరువురు భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. గవర్నర్ సమక్షంలో విభజన అంశాలను పరిష్కరించుకోవాలని గతంలో జరిగిన భేటీలో నిర్ణయించారు. అయితే గవర్నర్ నరసింహన్ స్థానంలో కొత్త గవర్నర్ తమిళిసై నియామకం కావడంతో అప్పుడు జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. పైగా తెలంగాణ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ఉండటంతో ఇరు రాష్ట్రాల మధ్య తిరిగి భేటీ కుదరలేదు.