రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 23: తిరుమల శ్రీవారిని బుధవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, అర్చకబృందం కలసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గవర్నర్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపానికి చేరుకున్న గవర్నర్‌కు వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ తీర్ధప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, రిసెప్షన్ డిప్యూటీ ఈఓ బాలాజీ, పేష్కార్ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరిస్తున్న టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి