రాష్ట్రీయం

మిస్టరీ చేధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, నవంబర్ 28: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసు చిక్కుముడిని చేధించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ప్రియాంకా రెడ్డి హత్యకు గురైన సంఘటన స్థలాన్ని గురువారం సాయంత్రం కమిషనర్ పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బుధవారం రాత్రి నుంచి జరిగిన సంఘటనలను దృష్టిలో తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కొల్లూరులో విధులు ముగించుకుని స్కూటీని శంషాబాద్ వద్ద పార్కు చేసి గచ్చిబౌలి వెళ్లి వచ్చేసరికి పంచరైన విషయాన్ని ప్రియాంక తన సోదరికి ఫోన్‌లో తెలియచేసిందని తెలిపారు. సీసీ ఫుటేజీల ద్వారా లభ్యమైన ఆధారాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాత్రివేళల్లో అసాంఘిక సంఘటనలు జరుగకుండా అవసరమైతే 100కు డయల్ చేయాలని కోరారు. కమిషనరు వెంట షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, సీఐ శ్రీ్ధర్ ఉన్నారు.