రాష్ట్రీయం

హైదరాబాద్-రత్లాం మధ్య ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాకు వెళ్లే యాత్రీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్-రత్లాంల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. మే 2వ తేదీ రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి నెం.07173 రైలు బయలుదేరి మరుసటి రోజు రత్లాంకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మే 3వ తేదీ రాత్రి 11.20 గంటలకు నెం.07174 రైలు రత్లాంలో బయలుదేరి మరుసటి రోజు హైదరాబాద్‌కు చేరుకుంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి.