రాష్ట్రీయం

నవ దంపతుల బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 26: ఆ యువతి మైనర్. ఆ యువకుడు వివాహం చేసుకుని భార్యకు విడాకులిచ్చి మైనర్ బాలికతో ప్రేమాయణంలో పడ్డాడు. వివాహానికి బాలిక తల్లితండ్రులు ససేమిరా అన్నారు. వారిద్దరూ ఇంటినుంచి పారిపోవడంతో తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ బాలిక తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైలుకి వెళ్ళిన ఆ యువకుడు బెయిల్‌పై వెలుపలికి వచ్చి తాను ప్రాణపదంగా ప్రేమించిన మైనర్ బాలికను తీసుకుని తిరుమల వెంకన్న సన్నిధిలో వివాహం చేసుకున్నాడు. అటు తరువాత తమను దూరం చేస్తారని భావించిన ఆ ఇద్దరు తమ చావుకు బాలిక తల్లితండ్రులే కారణమని సూసైడ్ నోట్ రాసి శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలోవున్న రాంభగీచా అతిధిగృహంలో తాము బసచేసిన గదిలోనే బలవణ్మరణానికి పాల్పడ్డారు. కోయంబత్తూరుకి చెందిన సంపత్ కుమార్ (25) అదే గ్రామానికి చెందిన సత్యవతి (17)తో ప్రేమలో పడ్డాడు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 23న తిరుమలకు వచ్చి రాంభగీచా అతిథిభవనం-3లో 384 నెంబరు గదిని అద్దెకు తీసుకున్నారు. వివాహం చేసుకున్నారు. స్వామి దర్శనం ముగించుకుని అర్థరాత్రి గదికి చేరుకున్నారు. మంగళవారం గదిని ఖాళీ చేయమని చెప్పడానికి సిబ్బంది వెళ్ళి తలుపులు తట్టారు. తలుపులు తెరవకపోగా ఆ గది నుంచి దుర్వాసన వెలువడుతుండటం గమనించారు. వెంటనే ఆవిషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. టిటిడి విజిలెన్స్, పోలీసు అధికారులు సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. తలుపులు పగులగొట్టారు. ఫ్యాన్ కొక్కీకి ఒకే దారానికి ఇరువైపులా సంపత్ కుమార్, సత్యవతి ఉరివేసుకుని వేలాడుతుండటానికి గమనించారు. వెంటనే శవపంచనామా నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా గదిలో మృతులిద్దరు వేర్వేరుగా రాసిన సూసైడ్ నోట్‌ను గుర్తించారు. ఇందులో సంపత్ కుమార్ రాసిన సూసైడ్ నోట్‌లో సత్యవతి తన మేనకోడలని, ఆమెను వివాహం చేసుకోవడానికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో గతనెల్లో వివాహం చేసుకోవడానికి ప్రయత్నించామన్నారు. అయితే సత్యవతి తల్లితండ్రులు దివ్యవాణి, శివన్ వారి కుటుంబ సభ్యులు తమను పట్టుకుని తీసుకువచ్చారని, తనపై కిడ్నాప్ కేసుకూడా పెట్టారన్నారు. బెయిల్ పై వచ్చిన తాను సత్యవతిని తిరుమల్లో వివాహం చేసుకున్నానన్నారు. ఇంటికి వెడితే చంపేస్తారని, అందుకే భగవంతుడి సన్నిధిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నామని రాశాడు. తన భార్యను, తనను ఒకే చోట ఖననం చేయాలని సూసైడ్ నోట్‌లో విజ్ఞప్తి చేశాడు. కాగా సత్యవతి రాసిన సూసైడ్ నోట్‌లో తమ ఆత్మహత్యలకు తన తల్లితండ్రులే కారణమని, తమ మృతదేహాలను తన అత్తమామలకు అప్పగించి వారిచేతే ఖననం చేయించాలని కోరారు. ఇదిలావుండగా వారి వద్ద లభించిన ఆధారాలతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా సంపత్ కుమార్ తన వద్ద ఉన్న సెల్‌లో భార్య సత్యవతిని పక్కన పెట్టుకుని సెల్పీ తీసుకుంటూ మాట్లాడిన వీడియోలో కొంత సమయానికి తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామని చెబుతుండటం, పక్కన సత్యవతి నవ్వుతూ ఉన్న దృశ్యాలను కూడా పోలీసులు గుర్తించారు.