రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లో మందు పాతర పేలి జవాను మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఏప్రిల్ 28: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పొంగుట్ట గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఆ రాష్ట్ర ఆర్మ్డ్ ఫోర్సు జవాను మృతిచెందాడు. పొంగుట్ట అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్సు (సిఎఎఫ్) పదవ బెటాలియన్‌కు చెందిన జవాన్లు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సిఎఎఫ్ అసిస్టెంట్ క్లాటూన్ కమాండర్ పాన్స్‌రాం భగత్ మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు మోపారు. దీంతో మందు పాతర పేలడంతో భగత్ తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే ఆయనకు స్థానిక వైద్యశాలలో చికిత్స అందిస్తుండగా మృతిచెందారు.