రాష్ట్రీయం

నేడు బాధ్యతలు స్వీకరించనున్న నలుగురు చైర్మన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మిషన్ భగీరథ వైఎస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్‌రావు, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యలు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్టీసి చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ మధ్యాహ్నాం 3.30కి బాధ్యతలు స్వీకరిస్తారు. మల్లెపల్లి లక్ష్మయ్య ఉదయం 11.30కి టూరిజం ప్లాజాలో బాధ్యతలు స్వీకరిస్తారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి , అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు ఉదయం పది గంటలకు సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్టీసి చైర్మన్‌గా నియమితులైన రామగుండం శాసన సభ్యులు సోమారపు సత్యనారాయణ, నాగార్జున సాగర్ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన మల్లెపల్లి లక్ష్మయ్య గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. కొత్త బాధ్యతలు విజయవంతంగా నిర్వహించగలరని ముఖ్యమంత్రి వారి పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.