రాష్ట్రీయం

పదో షెడ్యూల్ సంస్థల విభజనకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పదవ షెడ్యూలులో ఉన్న వివిధ సంస్థలపై ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. సుప్రీంకోర్టులోని సివిల్ అప్పీల్ 3019-3021/2016, ఎస్‌ఎల్‌పి 14705-14706/2016 లలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాష్ టక్కర్ అధ్యక్షతన ఒక కమిటీని శుక్రవారం నియమించింది. ఈ కమిటీలో న్యాయశాఖ కార్యదర్శి సిఎస్‌ఎస్‌వి దుర్గాప్రసాద్, మాజీ ఐఎఎస్ అధికారులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ప్రేమచంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఒక నివేదికను తయారుచేసిన తర్వాత వివిధ శాఖల కార్యదర్శులతో ప్రభుత్వం సమీక్షించనుంది.