రాష్ట్రీయం

20లోపు తెలంగాణ టెట్, ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 29: వచ్చే నెల 1, 2 తేదీల్లో జరగాల్సిన టెట్, ఎంసెట్ పరీక్షలను ఈ నెల 20వ తేదీలోగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 1 టెట్, 2న ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు ముమ్మరం చేయటంతో ఆ కళాశాలలన్నీ జెఏసిగా ఏర్పడి పరీక్షకు సహకరించలేదన్నారు. దీంతో పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చిందని, ఈ అంశంపై తాను ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడానని, త్వరలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.