రాష్ట్రీయం

కేంద్ర నిధులపై శే్వతపత్రం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదనే ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిజెపి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఈ నెల 4వ తేదీ బుధవారం నీతి అయోగ్ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇంతవరకు కేటాయించిన నిధులు తదితర అంశాలపై ఈ సమావేశంలో నీతి అయోగ్ ఉన్నతాధికారులు చర్చించనున్నారు. ఈ సమావేశం చాలా కీలకమైందిగా చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఏపికి ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తి వ్యయాన్ని తామే భరిస్తామని, రెవెన్యూ లోటును కూడా భర్తీ చేసి ఆదుకుంటామని విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలని చంద్రబాబుపై వత్తిడి పెరుగుతోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం ఇచ్చిన నిధులపై అంశాలవారీగా ఒక శే్వతప్రతం విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీ సమావేశం, మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు.
కొత్త రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్ల నిధులు ఇచ్చామని, పోలవరానికి రూ. 7100 కోట్ల నిధులు సమకూర్చి 2018 నాటికి ఒక దశ పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామని, పది జాతీయ విద్యా సంస్ధలను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి రాజ్యసభలో ప్రకటించగా, తమకు ఇంతవరకు రూ. 850 కోట్లు మాత్రమే అందిందని రాష్ట్రప్రభుత్వం అంటోంది. పోలవరం ప్రాజెక్టుకు రూ. 4000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గత ఫిబ్రవరిలోనే కేంద్రానికి వినతిపత్రం సమర్పించారు. కాని బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా, నాబార్డు నుంచి నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పినా, ఇంతవరకు ఫలితం శూన్యం. ఇటీవల కేంద్రం ఆదేశంపై పోలవరం అథారిటీ అధికారులు ప్రాజెక్టును సందర్శించి నిర్మాణాలను అంచనావేసి నివేదికను కేంద్రానికి అందించారు. ఈ నెల 4వ తేదీన జరిగే నీతి అయోగ్ సమావేశంలో ఈ అంశం చర్చకు రానుంది. రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోని 3, రాయలసీమలోని 4 వెనకబడిన జిల్లాలకు ఒకసారి మాత్రమే రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్ల చొప్పున రెండేళ్లుగా రూ. 700 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. విభజన సందర్భంగా రెవెన్యూలోటు రూ. 16,000 కోట్లు ఉంది. ఏపికి కేంద్రం రూ.13,500 కోట్లను రెవెన్యూ లోటు భర్తీకి చెల్లించాలని కాగ్ సిఫార్సు చేసింది. ఈ నివేదికను కూడా కేంద్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన తీరుకు కేంద్ర మంత్రులు ఉత్సాహంతో స్పందించడం, ఇంటర్వ్యూలు అడిగిన వెంటనే ఇవ్వడంపై టిడిపి సీనియర్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు.