రాష్ట్రీయం

వీడని వడగాడ్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు మరో వారంపాటు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. రాయలసీమ జిల్లాలతోపాటు కోస్తాలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో, తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది. గత 24 గంటల్లో తెలంగాణలోని భద్రాచలం, కోస్తాలోని జంగమేశ్వరపురంలలో అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలుపైనే నమోదు అవుతున్నాయి. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ తదితర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటంతో స్వల్పంగా ఎండ తీవ్రత తగ్గిందని ఐఎండి వెల్లడించింది.