రాష్ట్రీయం

రాజధాని డిజైన్లు మారుతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: రాజధాని అమరావతిని నిర్మించే సంస్థను ఖరారు చేసేపనిలో రాష్ట్ర ప్రభుత్వం బిజీ అయింది. అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకూ రాజధాని అమరావతికోసం చేసిన పని అంతా ఒక ఎత్తు, ఇకముందు జరిగేది మరో ఎత్తు అని అన్నారు. అత్యుత్తమ రాజధానిని నిర్మించేందుకు ప్రపంచం మెచ్చే డిజైన్లను తయారుచేసే ఆర్కిటెక్ట్‌లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు. ఈ డిజైన్లను జ్యూరీ ఎంపిక చేస్తుందన్నారు.
రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించి ఆకృతిలో మార్పులు చేసి తుదిరూపు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సోమవారం తన నివాసం నుంచి క్యాపిటల్ సిటీ ఆర్కిటెక్చర్ అడ్వైజరీ కమిటీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో వౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించి విభాగాల వారీగా నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వక్ఫ్ బోర్డు రికార్డుల కంప్యూటరీకరణకు కమిటీ
వక్ఫ్‌బోర్డు రికార్డుల కంప్యూటరీకరణకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి చైర్మన్‌గా మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కన్వీనర్‌గా వక్ఫ్‌బోర్డు సిఇఓ, సభ్యులుగా ఆర్థిక, రెవెన్యూ, న్యాయశాఖల డిప్యూటీ సెక్రటరీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఇద్దరు, ఐటి శాఖ నుంచి ఒకరు, ఎన్‌ఐసి నుంచి ఒకరిని నియమిస్తూ జివో జారీ చేసింది.