ఆంధ్రప్రదేశ్‌

10న పిఎస్‌ఎల్‌వి-సి 34 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 11: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి జూన్ 10న పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఈ రాకెట్ ద్వారా మనదేశానికి చెందిన కార్డోశాట్-2సి ఉపగ్రహంతో పాటు యూఎస్, ఇండోనేషియా దేశాలకు చెందిన 4మైక్రో, 17నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. మనదేశంతో పాటు విదేశాలకు చెందిన మొత్తం 22 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇంత వరకు ఇస్రో చంద్రయాన్-1 ద్వారా ఒకేసారి పది ఉపగ్రహాలను పంపి విజయవంతం చేశారు. ఇన్ని ఉపగ్రహాలను పంపడం ఇదే మొదటి సారి. ఇంత వరకు అమెరికా 25 ఉపగ్రహాలను ప్రయోగించి ఉన్నారు. అమెరికా తరువాత మన దేశం ఒకేసారి 22 ఉపగ్రహాలను పంపి విజయవంతం చేస్తే రెండో స్థానంలో నిలువనుంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి షార్‌లో వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులు వేగంగా జరుగుతున్నాయి.
23న ఆర్‌ఎల్‌వి-టిడి రాకెట్ ప్రయోగం
ఇటీవల కాలంలో అగ్రరాజ్యాలకు దీటుగా ఇస్రో కొత్తదనంతో కూడిన వినూత్న రకాల ప్రయోగాలకు శ్రీకారం చుట్టుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల సొంత జిపిఎస్ వ్యవస్థకు ఏడు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టి ఎన్నో యేళ్ల కళల సాకారాన్ని నిజం చేస్తూ సొంతంగా నావిగేషన్ వ్యవస్థను మన శాస్తవ్రేత్తలు రూపొందించారు. ఇదే తరహాలో ఇస్రో పునఃప్రవేశ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. ఇందుకు కూడా షార్ కేంద్రమే వేదిక కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం ఈ నెల 23న ఆర్‌ఎల్‌వి-టిడి పునర్వినియోగ వాహక నౌక ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం ( ఎం ఆర్ ఆర్) షార్‌లో డాక్టర్ సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్‌తోపాటు పలువురు శాస్తవ్రేత్తలు హాజరై ప్రయోగం పై సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం 1.7టన్నుల బరువుగల ఈ రాకెట్‌ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో (విఎస్‌ఎస్‌సి) మన శాస్తవ్రేత్తలు సొంతంగా రూపకల్పన చేశారు. అనంతరం అక్కడ నుండి బెంగళూరు ఉపగ్రహ తయారీ కేంద్రంలో రాకెట్‌కు పలు పరీక్షలు సైతం విజయవంతంగా నిర్వహించారు. 2012లోనే ఈ ప్రయోగానికి అనుమతి లభించింది. అనంతరం ఎల్‌ఎంవికేర్ మిషన్ అనే పునర్వినియోగ రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అనంతరం బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రయోగం ఆలస్యం జరిగింది. ఈ నెల 23న ప్రయోగించేందుకు షార్‌లో అన్ని ఏర్పాట్లను శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన చివరి ఎంఆర్‌ఆర్ సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఇలాంటి ప్రయోగాలు వల్ల ఒక రాకెట్‌లో ఉపయోగించిన పరికరాలు వృథా కాకుండా మళ్లీ వాటిని తెచ్చుకొని మరో ప్రయోగాల్లో ఉపయోగించుకోవచ్చును. దీని వల్ల ఖర్చువ్యయం తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవ్వడంతో మరిన్ని ప్రయోగాలు జరిపేందుకు వీలుంటుంది.