రాష్ట్రీయం

ఢిల్లీ పర్యటనపైనే బాబు దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: ఏపి సిఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఆదివారం విజయవాడకు వస్తున్నారు. వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ సహా పలు ముఖ్య శాఖల అధికారులు, మంత్రులతో సమావేశమవనున్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ హోదా గురించి చంద్రబాబు కేంద్రాన్ని అడగలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేంద్రం ఇచ్చిన నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దార్థనాథ్ సింగ్ ప్రకటనను టిడిపి జీర్ణించుకోలేకపోతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండడంతో సింగ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు పెద్దగా స్పందించలేకపోయారు. చంద్రబాబు ఆదివారం కేవలం ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అలాగే ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీతోపాటు పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో జరుగుతున్న జాప్యం, ఆర్థిక శాఖలో తలెత్తుతున్న సమస్యల గురించి సన్నిహితులు, మంత్రులతో చర్చించనున్నారు. కేంద్రానికి మళ్లీ లేఖ రాసేకన్నా, ఈసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది.