రాష్ట్రీయం

క్రూరాతి క్రూరంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నార్సింగ్, మే 14: నగర శివారులోని గండిపేట సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కత్తులతో బెదిరించి ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గండిపేట సమీపంలోని కోకాపేట గ్రామానికి చెందిన గూజ హిల్స్‌లోని అమృతానంద నిలయం ఫాంహౌస్‌లో మనోజ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నారు. అయితే ప్రతి రోజు మాదిరిగానే ఫాంహౌస్ శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. కాగా మనోజ్‌కుమార్ భార్య అక్క కూతురు (11) ఐదవ తరగతి చదువుతుంది. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు గుర్తుతెలియని యువకులు నిచ్చెన సహాయంతో మనోజ్‌కుమార్ ఇంట్లోకి ప్రవేశించి రెండు ల్యాప్‌టాప్‌లతో పాటు విలువైన మూడు సెల్‌ఫోన్లు దొంగలించుకుని తీసుకవెళ్తుండగా శబ్దం వచ్చింది. ఈ క్రమంలో మనోజ్‌కుమార్ భార్య అక్క కూతురు దొంగలు అని గ్రహించి కేకలు పెట్టింది. దీంతో వెంటనే మనోజ్‌కుమార్ నిద్రలేచి బయటి వచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే దొంగలు తెలివిగా మనోజ్‌కుమార్ రూమ్ తలుపు గొళ్లెం పెట్టేశారు. దీంతో మనోజ్‌కుమార్ బయటికి రాలేకపోయ్యాడు. దొంగలు చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి దుప్పటిలో చుట్టుకుని గేటు బయటికి తీసుకువెళ్లారు. అప్పటికే మనోజ్‌కుమార్ కూడా గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్నవాళ్లు వచ్చి తలుపు గొళ్లెం తీశారు. కాగా అప్పటికే ఆ చిన్నారిపై దొపిడీ దొంగలు అత్యాచారానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని జరిగిన సంఘటన వివరాలను తెలుసుకున్నారు. అత్యాచారానికి గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వేయాలని రాజేంద్రనగర్ వాసులు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

chitram దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన ఫాంహౌస్ ఇదే