రాష్ట్రీయం

ఖమ్మం కలెక్టర్‌గా మళ్లీ లోకేశ్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: పాలేరు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు వల్ల కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన ఐఎఎస్ అధికారి లోకేశ్ కుమార్‌ను తిరిగి ఖమ్మం కలెక్టర్‌గా నియమించారు. జిల్లా కలెక్టర్, ఎస్‌పి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కేంద్రం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించి జిల్లా కలెక్టర్, ఎస్‌పి, జిల్లా ఎన్నికల అధికారిని బదిలీ చేయాలని ఆదేశించింది. ఆ మేరకు అధికారులను బదిలీ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత లోకేశ్ కుమార్‌ను తిరిగి ఖమ్మం కలెక్టర్‌గా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.. ఇక హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండిగా దాన కిశోర్‌ను నియమించారు. మిగిలిన అధికారులను సైతం ఆయా స్థానాల్లో తిరిగి నియమించే అవకాశం ఉంది.