ఆంధ్రప్రదేశ్‌

వచ్చేది మా ప్రభుత్వమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 24: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్‌లను అడ్డుకునే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లేవని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అవినీతిపరుల కొమ్ముకాస్తూ బాబు ప్రగల్భాలు పలుకుతున్నారని దుమ్మెత్తిపోశారు. కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పులివెందులలో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ఎంతసేపు వైకాపానే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలోనూ, జిల్లాలో నీటి సరఫరా విషయంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉత్తరకుమార ప్రగల్భాలతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మరో మూడేళ్లు ఓపిక పడితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతుల కష్టాలు తీరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నోరుమెదపకుండా కేవలం అభివృద్ధి పేరిట నిధులు తెస్తామంటూ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడేది వైకాపా అని స్పష్టం చేశారు. త్వరలో రాజన్న రాజ్యాన్ని ప్రజలకు చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.